ఓ తండ్రి, కొడుకులు సమాజం తలదించుకునే పని చేశారు. దళిత మహిళను వివస్త్రను చేసి తీవ్రంగా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆమెతో మూత్రం తాగించారు. తీవ్ర గాయాలతో ప్రస్తుతం ఆ మహిళ హాస్పిటల్‌లో కొస ప్రాణాలతో చికిత్స పొందుతోంది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగింది. వాళ్లు ఆ మహిళ పట్ల ఎందుకు అలా ప్రవర్తించారు అనే విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.



మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది అని చెప్పడానికి తాజాగా జరిగిన ఓ ఘటన ఉదాహరణగా మారింది. తీసుకున్న అప్పును వడ్డీతో సహా తిరిగి చెల్లించినా ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. తన కుమారుడితో కలిసి ఓ దళిత మహిళ పట్ల అమానవీయంగా ప్రవర్తించాడు. అసలు, వడ్డీ మొత్తం చెల్లించినా.. ఇంకా డబ్బు కావాలంటూ ఆమెపై మృగాళ్లలా పడ్డారు. మొదట ఆమె బట్టలను విప్పించారు. ఆ తర్వాత తీవ్రంగా కొట్టారు. అదీ చాలదన్నట్లు ఆమె ముఖంపై మూత్రం పోసి.. తాగించారు. ఇంత అత్యంత దారుణ ఘటన బిహార్‌‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే..

పాట్నాకు చెందిన ప్రమోద్‌ సింగ్ అనే వ్యక్తి దగ్గరి నుంచి ఓ దళిత మహిళ రూ.1500 అప్పు తీసుకుంది. అయితే కొన్ని రోజుల తర్వాత రూ.1500 అసలు, దానికి వడ్డీ మొత్తం తిరిగి చెల్లించింది. అయితే తీసుకున్న అప్పు మొత్తం చెల్లించినా.. ఇంకా డబ్బు ఇవ్వాలని ప్రమోద్ సింగ్ సదరు మహిళను తీవ్ర వేధింపులకు గురి చేశాడు. అయితే తాను పూర్తిగా అప్పు చెల్లించానని ఆ మహిళ తేల్చి చెప్పింది. దీంతో ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షుతో కలిసి ఆ దళిత మహిళపై దారుణంగా దాడి చేశారు. ఆమె బట్టలు విప్పించి.. కర్రలతో తీవ్రంగా కొట్టారు. అనంతరం ఆమెపై మూత్రం పోశారు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆ దళిత మహిళతో మూత్రం తాగించి నరరూప రాక్షసుల్లాగా ప్రవర్తించారు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. అయితే ఇంత దారుణ ఘటన జరుగుతున్నప్పటికీ అక్కడ ఉన్న స్థానికులు ఎవరూ నిందితులు ఇద్దర్నీ అడ్డుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.

నిందితులు ఇద్దరు ఆ మహిళను తీవ్రంగా కొట్టడంతో ఆమె స్పృహ తప్పిపోయింది. అది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆమె తలపై బలమైన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని డాక్టర్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేశారు. నిందితులు ప్రమోద్‌ సింగ్‌, అన్షు మరో నలుగురు వ్యక్తులతో కలిసి బాధిత మహిళ ఇంటి కెళ్లి.. ఆమెను బలవంతంగా వారి ఇంటికి తీసుకు వచ్చినట్లు విచారణలో తేలింది. ఘటన తర్వాత ఇద్దరు నిందితులు మనుషుల్లో మానవత్వం మంటగలిసిపోతోంది అని చెప్పడానికి పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు స్పెషల్ టీంలు రంగంలోకి దిగాయని.. త్వరలోనే వారిని పట్టుకుంటామని తెలిపారు.